- Advertisement -
ముంబయి: 2021 ఐపిఎల్ మ్యాచ్లు ఆధారంగా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్లయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాకు ప్లయింగ్ ఎలెవెన్ జట్టులో చోటుకల్పించలేదు. కెప్టెన్గా రిషబ్ పంత్ను సెలెక్ట్ చేశాడు. ఓపెనర్లుగా కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మూడోస్థానంలో డుప్లెసిస్, మిడిలార్డర్లో గ్లెన్ మ్యాక్స్వెల్, ఎబి డివిలియర్స్ ఎంపిక చేశాడు. ఆల్ రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా, క్రిస్ మోరిస్, స్పినర్గా రాహుల్ చాహర్ను తీసుకున్నాడు. పేస్ బౌలింగ్ విభాగంలో ఆవేష్ ఖాన్, హర్షల్ పటేల్కు చోటు కల్పించారు. ఐపిఎల్ 2021 సీజన్లో కెకెఆర్, ఢిల్లీ, సిఎస్కె, ఎస్ఆర్హెచ్ జట్లలోని ఆటగాళ్లు కరోనా సోకడంతో లీగ్ను బిసిసిఐ రద్దు చేసింది. 2021 సీజన్లో 29 మ్యాచ్లు జరిగాయి. ఇంకా 31 మ్యాచ్లు జరగాల్సి ఉంది.
- Advertisement -