Saturday, April 20, 2024

ఢిల్లీ ఆశలు సజీవం..

- Advertisement -
- Advertisement -

IPL 2022: DC Win by 17 runs against PBKS

ముంబై: ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ 17 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మిఛెల్ మార్ష్ 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 63 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. సర్ఫరాజ్ (32), లలిత్ యాదవ్ (24) తమవంతు సహకారం అందించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు బెయిర్‌స్టో (28), ధావన్ (19), వికెట్ కీపర్ జితీష్ శర్మ (44), రాహుల్ 25 (నాటౌట్) మాత్రమే రాణించారు. మిగతావారు విఫలం కావడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.

IPL 2022: DC Win by 17 runs against PBKS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News