Tuesday, April 16, 2024

IPL 2023: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరికాసేపట్లో ఇరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేధికగా జరగనున్న ఈ మ్యాచ్ కు సర్వం సిద్దమైంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా ఐదింటిలో ఓడిపోయింది. ఇక బెంగళూరు ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలను దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలనే దృఢసంకల్పంతో బెంగళూరు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News