- Advertisement -
దుబాయ్: ఐపిఎల్-13 సీజన్ లో భాగంగా జరుగుతున్న చెన్నై, ముంబయి మ్యాచ్ లో చెన్నైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. బౌల్ట్ బౌలింగ్ లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఎల్బి అయ్యాడు. అంపైర్ ఔటియ్యనప్పటికి ముంబయి సమీక్ష కోరి విజయవంతమయ్యింది. ఆ తరువాత బుమ్రా బౌలింగ్ లో అంబటి రాయుడు పెవిలియన్ చేరాడు. షార్ట్ పిచ్ బంతిని ఆఫ్ సైడ్ జరిగి ఆడబోయిన రాయుడి గ్లోవ్స్ కు తగిలి బంతిని కీపర్ డికాక్ అందుకున్నాడు. తరువాత వెంటనే జగదీశన్ స్లిప్ లో సూర్యకుమార్ యాదవ్ కు దొరికాడు. ధోని, జడేజా బ్యాటింగ్ చేస్తున్నారు. చెన్నై నాలుగు ఓవర్లలో 18 పరుగులు చేసి 04 వికెట్లు కోల్పోయింది.
- Advertisement -