Thursday, April 18, 2024

ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ సమయంలో మార్పు!

- Advertisement -
- Advertisement -

IPL final on October 15!:BCCI

 

ముంబై: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫైనల్ మ్యాచ్ సమయంలో నిర్వాహకులు మార్పులు చేశారు. ఈ మ్యాచ్‌ను రాత్రి 7.30 గంటలకు బదులు అర్ధ గంట ఆలస్యంగా 8 గంటల నుంచి నిర్వహించాలని ఐపిఎల్ పాలక మండలి నిర్ణయించింది.

ముగింపు వేడుకలకు తగినంత సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఈ మార్పు చేశారు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో రాత్రి మ్యాచ్‌లు అన్ని 7.30 గంటలకే ఆరంభమైన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్‌లో మాత్రం మార్పులు చేసి 8 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈనెల 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News