Tuesday, April 23, 2024

నారాయణ ఖేడ్ లో సాగునీటి సమస్య పరిష్కారం కాబోతోంది: భూపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: నారాయణ ఖేడ్ లో సాగునీటి సమస్య పరిష్కారం కాబోతోందని ఎంఎల్ఎ భూపాల్ రెడ్డి తెలిపారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గ స్థాయి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో భూపాల్ రెడ్డి మాట్లాడారు  కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను సింగూర్ ప్రాజెక్ట్ ను అనుసంధానం చేస్తామన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు లను సిఎం కెసిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నామన్నారు. నారాయణ ఖేడ్ లో లక్ష మందితో సిఎం సభ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో, ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News