- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులకు కొత్త సర్టిఫికెట్ జారీ చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీళ్లు రావడంతో తమ సర్టిఫికెట్లు కోల్పోయినట్లు విద్యార్థుల నుంచి విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్ పేర్కొన్నారు. వర్షాలు, వరదల కారణంగా సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఉచితంగా కొత్త సర్టిఫికెట్లు జారీ చేయాలని పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ఇంటర్మీడియేట్, కళాశాల, సాంకేతిక విద్యాశాఖల కమిషనర్లతో పాటు యూనివర్సిటీ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థులు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
- Advertisement -