Thursday, April 18, 2024

పార్లమెంటు ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవకపోవడం అవమానకరం

- Advertisement -
- Advertisement -
  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వం
  • స్థానిక సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలి
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

    ఖమ్మం : నూతన పార్లమెంట్ భవన ప్రారంభానికి రాష్ట్రపతిని పిలవకపోవడం అవమానకరమైన విషయమని, ఎందుకు రాష్ట్రపతిని పిలవలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గుడవర్తి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సిపిఎం పాలేరు నియోజకవర్గ సమావేశంలో తమ్మినేని వీరభద్రం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ప్రారంభంలో ప్రతిపక్షాలకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, 19 పార్టీలు బహిష్కరణ చేసినా సరే అత్యంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం, దానిని వెనక నుండి నడిపిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ ఈ దేశాన్ని మత రాజ్యాంగ మార్చేందుకు కుట్రలు చేస్తున్నాయని, అందుకే రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, పాత రాచరిక వ్యవస్థను తీసుకువచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతిలో వారి విధానాలు ఉన్నాయని ఆయన అన్నారు. అందుకే బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ మతతత్వ విధానాలను వెనక్కి కొట్టేందుకు క్యాడర్ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కర్ణాటకలోలాగా దేశం నుంచి కూడా బిజెపిని తరిమేసే సమయం ఆసన్నమైందని, మతోన్మాద రాజకీయాలు ఇక మీదట సాగవని ఆయన అన్నారు. జూన్, జూలై నెలల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, బుగ్గవీటి సరళ, జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్, సుదర్శన్ రెడ్డి, మండల కార్యదర్శులు కొమ్ము శ్రీను, కె.వి.రెడ్డి, నియోజకవర్గ నాయకులు అంగిరేకుల నరసయ్య, రామారావు, తోటకూర రాజు, గంగాధర్, పొన్నెకంటి సంగయ్య, కృష్ణ, నాగేశ్వరరావు, వీరన్న, సురేష్, కట్టెకోల వెంకన్న, తమ్మినేని వెంకట్రావు, రంజాన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News