Friday, April 19, 2024

ఓ భారతీయుడు, 9మంది స్నేహితులకు యుఎఇలో రూ.40 కోట్ల జాక్‌పాట్

- Advertisement -
- Advertisement -

Jackpot of Rs 40 crore in UAE for an Indian and 9 friends

 

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)లో ఓ భారతీయుడు, ఆయన 9మంది స్నేహితులకు రూ.40కోట్ల (2 కోట్ల దిర్హామ్‌ల) విలువైన జాక్‌పాట్ తగిలింది. కేరళకు చెందిన రెంజిత్ సోమరాజన్(37)తోపాటు అతని 9మంది స్నేహితులు శనివారం డ్రా తీసిన ఓ లాటరీలో ఈ మొత్తాన్ని గెలుచుకున్నారు. అబూదాబీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేసే రెంజిత్ మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఒప్పించి తన స్నేహితులతో కలిసి ఉమ్మడిగా తన పేరు మీద 100 దిర్హామ్‌లతో జూన్ 29న టికెట్లు కొన్నారు.

రెండు టికెట్లకు ఒకటి ఫ్రీ అనే స్కీంలో టికెట్లు కొన్నామని రెంజిత్ తెలిపారు. లాటరీలో 3 మిలియన్ దిర్హామ్‌ల విలువైన రెండో ప్రైజ్, మిలియన్ దిర్హామ్‌ల విలువైన మూడో ప్రైజ్‌సహా పలు ప్రైజ్‌ల ద్వారా తమ బృందం ఈ మొత్తాన్ని గెలుచుకున్నదని రెంజిత్ తెలిపారు. తన స్నేహితులు భారత్‌తోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్‌కు చెందినవారని ఆయన తెలిపారు. వారంతా ఓ హోటల్‌లో పార్కింగ్ వద్ద పని చేస్తారని ఆయన తెలిపారు. 2008 నుంచి ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నానని రెంజిత్ తెలిపారు. ప్రస్తుతం ఉపాధి కష్టంగా ఉన్న సమయంలో తమను జాక్‌పాట్ వరించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News