- Advertisement -
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సోమవారం విచారించింది. పలు మోసాల అభియోగాతో నిందితుడు అయిన సుఖేష్ చంద్రశేఖర్కేసు సంబంధిత అంశాలపై ఈ శ్రీలంక నటిని విచారించిన ఇడి వాంగ్మూలం రికార్డు చేసుకుంది. పిఎంఎల్ఎ పరిధిలో జాక్వెలిన్ను కేసులో సాక్షిగా పరిగణించారు. వాంగ్మూలం తీసుకున్నారని అధికారవర్గాలు తెలిపాయి. వేలాది కోట్ల వసూళ్ల రాకెట్కు సంబంధించి చంద్రశేఖర్పై కేసులు దాఖలు అయ్యాయి. ఆయనకు చెందిన చెన్నై సముద్ర తీర బంగళాలో జరిపిన సోదాలో రూ 83 లక్షల నగదు, డజన్ వరకూ విలాసవంతపు కార్లు స్వాధీనపర్చుకున్నారు. దాదాపు రూ 200 కోట్ల వరకూ మోసాలు, బలవంతపు వసూళ్ల క్రిమినల్ కేసులో ఢిల్లీ పోలీసులు చంద్రశేఖర్పై దర్యాప్తు జరిపారు.
- Advertisement -