Saturday, April 20, 2024

శ్రీశైలంలో జడ్చర్ల నివాసి మృతి

- Advertisement -
- Advertisement -

Jadcherla person died in Srisailam

జడ్చర్ల : శ్రీశైలంలో దర్శనానికి వెళ్లిన జడ్చర్ల వాసి ఆదివారం మృతిచెందాడు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుండగా వల్లిక అశోక్ అనే భక్తుడు హఠాత్తుగా కిందపడిపోయాడు. స్థానికులు గమనిం చి అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే అశోక్ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడిని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లి వాసి గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News