- Advertisement -
నల్గొండ: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, హరితహారంలో అందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. నకిరేకల్లో జరిగిన హరితహారం కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపి లింగయ్య యాదవ్, ఎంఎల్ఎ చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోందన్నారు. హరిత తెలంగాణ సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -