- Advertisement -
హైదరాబాద్: మహమ్మారి కరోనాపై చేస్తున్న పోరులో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రజలంతా ఇళ్లలో విద్యుద్దీపాలు ఆర్పేసి.. జ్యోతి వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రతీఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతి ఐక్యతను చాటాలని కోరారు. రాత్రి 9 గంటలకు ఇళ్లలో విద్యుద్దీపాలు ఆర్పేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని, సాంకేతికపరంగా సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం శానిటైనజర్లు వినియోగిస్తున్నందున.. జ్యోతి వెలిగించే ముందు చేతులు బాగా కడుక్కోవాలి మంత్రి సూచించారు.
Jagadish Reddy Urges to People to light Candles
- Advertisement -