మనతెలంగాణ/హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో తనకు హాజరు నుంచి మినహాయిపు నివ్వాలంటూ ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మరోసారి హైకోర్టుని ఆశ్రయించారు. సిబిఐ కోర్టు తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎపి సిఎంగా ప్రతి నిత్యం సమీక్షలు, సమావేశాలు, ప్రారంభోత్సవాల్లో బిజిబిజిగా ఉంటానని పాలనాపరమైన విధుల్లో తలమునకలై ఉంటానని పిటిషన్లో వివరించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహయింపును కోరుతూ పిటిషన్ వేయగా హైకోర్టు తిరస్కరించింది. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసింది. తాజాగా మళ్లీ జగన్ ఇదే విషయంపై మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. త్వరలో దీనిపై న్యాయస్థానం విచారణ జరిపే అవకాశం ఉంది.
Jagan Approach to HC over appearance before CBI Court