Thursday, April 25, 2024

అమెరికా మారథాన్‌కు జగన్మోహన్ అర్హత

- Advertisement -
- Advertisement -

Jaganmohan Reddy of Telangana qualified for US Marathon

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన అమెరికా మారథాన్ పోటీలకు తెలంగాణకు చెందిన జగన్మోహన్ రెడ్డి అర్హత సాధించాడు. అమెరికాలోని చికాగో వేదికగా అక్టోబర్ 10న ఈ మారథాన్ జరుగనుంది. ఈ అథ్లెటిక్స్ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ అథ్లెట్లు పాల్గొంటారు. ఇక భారత్ తరఫున కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన జగన్మోహన్ రెడ్డి దీనికి అర్హత సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ మారథాన్‌కు అర్హత సాధించడం అంత తేలికేం. అయితే తెలుగుతేజం జగన్మోహన్ మాత్రం అసాధారణ ప్రతిభతో ఈ మారథాన్‌కు అర్హత సాధించి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు. ఇక జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం ఘనంగా సన్మానించారు. జగన్మోహన్‌కు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మారథాన్ పోటీల్లో జగన్మోహన్ పతకం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News