Thursday, April 18, 2024

పిసిసి అధ్యక్ష రేసులో ఉన్నా : జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

Jagga Reddy

హైదరాబాద్ : పిసిసి అధ్యక్ష పదవి రేసులో తాను ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి నియోజకవవర్గం ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి తెలిపారు. చాలా సీరియఎస్‌గానే తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం నాడిక్కడ ఆయన మీడియాతో కొద్దిసేపు చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జీ కుంతియాను కలిసి తనకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. శివరాత్రి తర్వాత ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ ని కలుస్తానన్నారు. ఎమోషన్ పాలిటిక్స్ ఇప్పుడు పని చేయవన్నారు.

ప్రజల నాడిని పట్టి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పుడున్న రాజకీయాలు పరిస్థితిల్లో డబ్బులు, అభివృద్ధి కోణంలోనే రాజకీయ వ్యూహం చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు, జూనియర్లు కలిసి పనిచేస్తేనే రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. చాలా లౌక్యంతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడుందన్నారు. కాగా రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా జగ్గారెడ్డి చెప్పారు.

Jagga Reddy To Enter Race for TPCC Chairman Post

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News