జమ్ము కాశ్మీర్, మల్లాపూర్ పోలీసుల విచారణ
మనతెలంగాణ/మెట్పల్లి: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన సరికెల లింగన్న అనే వ్యక్తి టెర్రరిస్ట్ ఖాతాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంతో జమ్ము కాశ్మీర్ లోని ఆర్నియాలో పోలీసులు సోమవారం రాత్రి మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో విచారణ చేయడంతో కలకలం సృష్టించింది. మల్లాపూర్ ఎస్.ఐ. రవీందర్ కథనం ప్రకారం…. జమ్ము కాశ్మీర్లో ఆర్మీలో పని చేస్తున్న రాకేష్ అనే వ్యక్తికి అనిత అనే ఒక అమ్మాయి తో పరిచయం ఏర్పడింది. ఆమె రాకేష్ను ఇండియన్ ఆర్మీ క్యాంప్కు సంబందించిన లొకేషన్ మ్యాపు ఇతర రహస్య వివరాలను ఆమెకు ఇచ్చి పాకిస్తాన్ కు చేరవేశాడనే పిర్యాదుపై జమ్ము జిల్లా ఆర్రియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా రాకేష్కు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన సరికెల లింగన్న అనే వ్యక్తి దుబాయిలో ఉన్న స్నేహితుడు శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 13న రూ॥ 5000, ఫిబ్రవరి 20న రూ॥ 4000 గుగుల్ పే ద్వారా తన ఖాతా నుండి ట్రాన్స్ఫర్ చేయడంతో ఆర్నియా ఎస్.ఐ. సాదిక్ హుస్సేన్ , హెడ్ కానిస్టేబుల్ సురేంధర్ సింగ్, కుల్దీప్ కుమార్ లు సోమవారం రాత్రి మల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లింగన్న ను కుస్తాపూర్ నుండి మల్లాపూర్ ఎస్.ఐ. రవీందర్ సహాయంతో తీసుకవచ్చి విచారించారు. దీంతో లింగన్నపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుచనున్నట్లు ఎస్.ఐ. తెలిపారు.