జైపూర్: అదేదో సినిమాలో ఓ హీరో ‘పెళ్లొద్దురా బ్రదర్…సోలో బతుకే బెటర్…’అంటూ పాటపడి ప్రేక్షకులని మెప్పించాడు. సోలో బతుకేమోగానీ, రాజస్థాన్లోని ఓ హోటల్లోకి ఒంటరి మగాళ్లను అనుమతించరట. ‘ఈ ఫిటింగేమిటి?’ అని చాలా మంది విస్తుబోతున్నారు. జైపూర్లోని హోటల్ వాళ్లు బాహాటంగా బోర్డునే పెట్టి మరీ అడ్డుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది.
హర్షితా శర్మ అనే ఓ ట్విట్టర్ వినియోగదారిని ఈ విషయాన్ని టిట్టర్లో పోస్ట్చేసింది. పప్పు రొట్టె తినడం కోసం తనకు తెలిసిన ఒంటరి వ్యక్తి తనను తోడు తీసుకెళ్లడాన్ని ఆమె అందులో రాసుకొచ్చింది. జైపూర్లోని ‘గోపి పవిత్ర భోజనాలయం’లో ఆ రుచికరంగా ఉంటుందట. ట్రై చేయి అని కూడా ఆవిడ సలహా ఇచ్చిపారేసింది.
So this guy took me here to have dal roti because pic.twitter.com/PVrgeuS4H9
— Harshita Sharma (@Harshita511) October 17, 2021