Friday, April 19, 2024

చికిత్స పొందుతూ ఆర్మీ జవాన్ మృతి

- Advertisement -
- Advertisement -

Jawan dead in treatment in Kamareddy road accident

మనతెలంగాణ/సదాశివనగర్: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని దిగ్గి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఆర్మి జవాన్ మృతి చెందినట్లు ఎస్సై జగడం నరేష్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం గన్నారం తాండాకు చెందిన మోతీలాల్ గత నెల 12న కామారెడ్డి నుంచి తాండాకు వెళ్తుండగా మార్గమద్యలో దగ్గి గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. చిక్సిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ లోని ఆర్మీ హస్పిటల్ లో చేర్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై పేర్కొన్నారు. మృతి చెందిన మోతీలాల్ ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News