- Advertisement -
న్యూఢిల్లీ: కరోనా సెకండ్వేవ్ నేపథ్యంలో జెఇఇ-మెయిన్స్ మే నెల 24-28 షెడ్యూల్ను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఏ) ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ ఎడిషన్ను ఇప్పటికే వాయిదా వేసింది. ఈ రెండు షెడ్యూళ్లను ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టిఎ తెలిపింది. మే షెడ్యూల్కు రిజిస్ట్రేషన్ల తేదీలను కూడా తెలియజేస్తామని పేర్కొన్నది.
- Advertisement -