Wednesday, April 24, 2024

టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి గెలుపు ఖాయం: జోగు రామన్న

- Advertisement -
- Advertisement -
jogu ramanna mlc election campaign in Abdullahpurmet
మాజీ మంత్రి జోగు రామన్న

అబ్దుల్లాపూర్‌మెట్: మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి గెలుపు ఖాయమని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం అబ్దుల్లాపూర్‌మెట్ మండల మున్సిపల్ టిఆర్‌ఎస్ అధ్యక్షులు పూజారి చక్రవర్తిగౌడ్‌ల ఆధ్వర్యంలో బాటసింగారం, మజీద్‌పూర్, లష్కర్‌గూడ, అబ్దుల్లాపూర్‌మెట్, అనాజ్‌పూర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జోగు రామన్న పాల్గొన్ని ముమ్మరంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. భారత ప్రధానమంత్రి కుమార్తి సురభివాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన విద్యావంతురాలు సురభివాణిదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చెరుకు కిరణ్‌కుమార్‌గౌడ్, ఎర్రవెళ్లి లతశ్రీగౌరిశంకర్‌చారీ, ఏసూరి పారిజాతశేఖర్, కవాలి రంగయ్య ముదిరాజ్, టిఆర్‌ఎస్ నేతలు కళ్లెం ప్రభాకర్‌రెడ్డి, రమేష్‌గౌడ్, మొగుళ్ల జీవన్‌రెడ్డి, ఉమాకాంత్‌చారీ, జంగయ్యగౌడ్, పన్నీరు రాజేష్, మందుగుల సతీష్‌గౌడ్ త, నర్సింగ్‌రావు, బ్రహ్మచారీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News