Saturday, April 20, 2024

దొంగలతో పోరాడిన జర్నలిస్ట్

- Advertisement -
- Advertisement -

 

Journalist Chases thieves for her Phone
హైదరాబాద్: ఢిల్లీలో నడి వీధుల్లో దొంగలతో పోరాడి సెల్‌ఫోన్ సొంతం చేసుకున్న లేడీ జర్నలిస్ట్‌ను పోలీసులు అభినందించారు. ఆమె ఢిల్లీలోని దూరదర్శన్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తోంది. ఆఫీస్ నుంచి మాల్వియా నగరానికి ఆటోలో వెళ్తుండగా ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి సెల్‌ఫోన్ లాక్కెళ్లారు. నిందితులు బైక్‌పై నుంచి పడిపోవడంతో వారిని వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించింది. ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లో నిందితులు నివాసం ఉంటున్నారని పోలీసులు వెల్లడించారు. దొంగలు పలు దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించడమే కాకుండా గతంలో డ్రగ్స్ దందా కూడా చేసేవారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News