మన తెలంగాణ/ధర్మసాగర్ : నిజాలను నిర్భయం గా రాసిన ఓ పాత్రికేయుడిని ధర్మసాగర్ సిఐ బొల్లం రమేష్కుమార్యాదవ్ భయబ్రాంతులకు గురిచేయడాన్ని వ్యతిరేకిస్తూ ధర్మసాగర్ ప్రింట్ మీడియా ప్రతినిధులు శుక్రవారం సిపి కార్యాలయంలో ఫిర్యాదును అందజేశారు. సిఐ రమేష్ చేస్తున్న అన్యాయాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువస్తున్న మనతెలంగాణ పత్రిక విలేకరిని సిఐ ఏమైనా చేసే అవకాశం ఉన్నందున సిఐ నుండి ఆవిలేకరికి రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసందర్భంగా మన తెలంగాణ పత్రిక విలేకరి గజ్జెల సుమన్ మాట్లాడు తూ.. ప్రశ్నించే గొంతుకను ఆపాలని సిఐ ప్రయత్నం చేశారని, నిజాలను రాస్తే దుర్భాషలాడుతారా అని ప్రశ్నించారు. ఓవిలేకరితోనే స్టేషన్ ఆవరణలో ఆక్రోశానికి అధికార ప్రతాపాన్ని చూపించిన సిఐ సా మాన్య ప్రజలతో ఎలా ఉంటున్నాడో అర్థం చేసుకోవచ్చని హితవు పలికారు. సిఐ రమేష్ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారని, అన్నివార్తలను నిర్భయంగా ప్రచురిస్తానన్నారు.