యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’లో నటిస్తున్నారు. దీని తర్వాత తారక్… కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ ‘ఎన్టీఆర్30’ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. తనదైన శైలిలో సామాజిక అంశాలు, – కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా దర్శకుడు ఈ స్టోరీ రెడీ చేస్తున్నారట. అది కూడా స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలో ఉంటుందని టాక్. అలాగే పాన్ ఇండియా స్థాయిలో రూపొందే సినిమా కాబట్టి పలువురు బాలీవుడ్ స్టార్స్ని తీసుకోనున్నారని తెలిసింది.
ఈ క్రమంలో ‘భరత్ అనే నేను’ సినిమాతో తాను టాలీవుడ్కు పరిచయం చేసిన ఉత్తరాది భామ కియారా అద్వానీని హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారని సమాచారం. దీని కోసం కియారాకు భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. అంతేకాదు ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ఓ బాలీవుడ్ స్టార్ యాక్టర్ని సంప్రదిస్తున్నారట. అయితే ఆ నటుడు ఎవరనేది తెలియలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుంది. ఇకపోతే తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి వర్క్ చేయనున్నాడని తెలిసింది. దీనికి ‘సెన్సేషనల్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్ సమర్పణలో యువసుధ ఆర్ట్ బ్యానర్పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్30 ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.