Wednesday, April 24, 2024

ప్రశాంత్ నీల్‌తో పీరియాడిక్ మూవీ

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో ఎన్టీఆర్‌తో యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించనున్నాడన్న సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం పీరియాడిక్ మూవీ అని… ఇండియా నుంచి పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత జరిగిన కొన్ని పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందట. ఆ తరువాత – ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధంలో గెలుపు కోసం ఇండియా ఎంత గొప్పగా పోరాటం చేసిందనే ఇతివృత్తాన్ని తీసుకొని ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తీయబోతున్నట్లు తెలిసింది. ఇక ఈ సినిమాని పాన్ – ఇండియా స్థాయిలో దాదాపు 250 కోట్ల బడ్జెట్‌లో నిర్మించనున్నారట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బల్క్ డేట్స్ కేటాయిస్తున్నాడని తెలిసింది. 2022లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2023 తరువాత ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

Jr NTR and Prashanth Neel’s shooting begins in 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News