Friday, April 26, 2024

తెలంగాణ హైకోర్టు సిజెగా హిమా కోహ్లీ నియామకం

- Advertisement -
- Advertisement -

Justice Hima Kohli Appointed as CJ of TS High Court

హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలువురు సిజెలు, న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈనెల 14న జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు కొలీజియం తొమ్మిది మంది బదిలీకి సిఫారసులు చేసింది. దీంతో తెలంగాణ, ఎపి హైకోర్టులకు కొత్త సిజెలు నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా హిమా కోహ్లీ నియమితులయ్యారు. ఎపి హైకోర్టు చీఫ్ జస్టీస్ గా అరూప్ గోస్వామి నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టీస్ ఆర్ ఎస్ చౌహాన్ ఉత్తరాఖండ్ కు బదిలీ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న హిమా కోహ్లీ పదొన్నతి పొంది తెలంగాణ హైకోర్టు సిజెగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టీస్ గా ఉన్న అరూప్ గోస్వామి ఎపికి బదిలీ కాగా.. ఎపి హైకోర్టు చీఫ్ జస్టీస్ మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ అయ్యారు.

Justice Hima Kohli Appointed as CJ of TS High Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News