Wednesday, April 24, 2024

కచ్చిడి చేప@రూ.1.70 లక్షలు

- Advertisement -
- Advertisement -

Kachidi fish rate is RS.1.70 Lakhs

 

అమరావతి: కచ్చిడి చేప అంటేనే పోటీపడి మరి కొనుగోలు చేస్తారు చేపల ప్రియులు. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో ఓ మత్స్యకారుడికి 28 కిలోల కచ్చిడి చేప వలకు చిక్కింది. దీంతో పలువురు తాము కొనుగోలుచేస్తామంటే తాము కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చారు. పోటీపడి మరి దారకొండకు చెందిన ఓ వ్యక్తి 28 కిలోల కచ్చిడి చేపను రూ.1.70 లక్షలకు కొనుగోలు చేశాడు. చేప పొట్ట భాగాన్ని మెడిసిన్ తయారీకి ఉపయోగిస్తారు. ఆడ, మగ కచ్చిడి చేపల్లో మగ చేప ఎక్కువ ధర పలుకుతోంది. కచ్చిడి మగ చేపను కొనుగోలు చేయడానికి చేపలు ప్రియులు పోటీపడుతారు.  కచ్చిడి చేప తింటే రోగాలు దరిచేరవని నమ్మకం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News