- Advertisement -
జగిత్యాల: ప్రతి నియోజకవర్గంలో ప్రతీ కాలువలో పిచ్చి మొక్కలు, రాళ్లు తొలగించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గొల్లపల్లిలో ఎస్ఆర్ఎస్పి కాలువలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ రివ్యూ నిర్వహించారు. ధర్మపురి నియోజకవర్గంలో కాలువల మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా శుభ్రం చేసే కార్యక్రమం మంత్రి కొప్పుల ప్రారంభించారు. గతంలో కాలువలు బాగున్నా నీరు వచ్చేది కాదన్నారు. సిఎం కెసిఆర్ ప్రణాళికతో ప్రతి గ్రామానికి కాళేశ్వరం జలాలు అందుతున్నాయని ప్రశంసించారు. సిఎం కెసిఆర్ ముందు చూపుతో తెలంగాణలో వ్యవసాయ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని కొనియాడారు.
- Advertisement -