- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం జరగనున్న అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తెలిపారు. భారత్ బంద్ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వాయిదా పడిన బిపిటి, బిఎస్సి ఎంఎల్టి సెకండ్ ఇయర్ పరీక్షల తేదిలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈనెల 9వ తేదిన జరిగే పరీక్షలన్నీ యధాతధంగా కొనసాగుతాయని ఎగ్జామినేషన్ కంట్రోలర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
- Advertisement -