- Advertisement -
నాగర్కర్నూల్: కల్వకుర్తి మాజీ ఎంఎల్ఎ ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఒమేగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎడ్మ కిష్టారెడ్డి రెండు సార్లు కల్వకుర్తి ఎంఎల్ఎగా పని చేశారు. 1994-94 లో ఇండిపెండెంట్ గా గెలిచిన ఆయన రెండోసారి 2004-09 కాంగ్రెస్ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. ఎడ్మ కిష్టారెడ్డి మరణం పట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సామాజిక సేవా దృక్పథం, సామాజిక సృహ కలిగిన నాయకుడిగా కిష్టారెడ్డి ప్రజల మనసులో స్థానం సంపాదించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. కిష్టారెడ్డి మృతిపై పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు.
Kalwakurthy Former mla krishna Reddy passes away
- Advertisement -