Tuesday, April 23, 2024

“కళ్యాణం కమనీయం” చిత్రం నుంచి “ఓ మనసా” లిరికల్ సాంగ్ రిలీజ్

- Advertisement -
- Advertisement -

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి “ఓ మనసా” అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేసి పాడారు. ఓ యువ జంట పెళ్లి సంబంధం కుదిరినప్పటి నుంచి పెళ్లయ్యే దాకా సాగే సందర్భాలన్నీ ఈ పాటలో అందంగా చూపించారు. నా కథలే మలుపే తిరిగే, నీ మహిమే జరిగే.. నా కనులా నిదురే తరిగే…నీ కలలే పెరిగే..అంటూ బ్యూటిఫుల్ లిరిక్స్ తో సాగుతుందీ పాట.ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది.యూవీ కాన్సెప్ట్స్ నుంచి మరో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశలో ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News