Thursday, March 28, 2024

రోడ్డు ప్రమాదంలో జవాను మృతి

- Advertisement -
- Advertisement -

Kamareddy Jawan killed in Rajasthan road accident

జైపూర్: రాజస్థాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డికి చెందిన జవాను మృతి చెందాడు. శనివారం రాత్రి రాజస్థాన్ శ్రీగంగానగర్ వద్ద ట్రక్కు బోల్తాపడి జవాను ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని గంధారి మండలం గండివేట్ తండా వాసి కిషన్ నాయక్ గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కిషన్ నాయక్ రాజస్థాన్ లో సైనిక హవల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కిషన్ నాయక్ మృతితో గండివేట్ తండా విషాధ చాయాలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరు కన్నీరుమున్నీరవుతున్నారు.

Kamareddy Jawan killed in Rajasthan road accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News