Wednesday, April 24, 2024

మిజో గవర్నర్‌గా కంభంపాటి ప్రమాణం

- Advertisement -
- Advertisement -

Kambhampati Hari Babu sworn as Mizoram Governor

ఐజ్వాల్: మిజోరం 22వ గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంభంపాటి 2014లో ఎపి బిజెపి అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ఏడాదే విశాఖపట్టణం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రవర్శిటీ నుంచి బిటెక్ చేసిన హరిబాబు ఎలక్ట్రికల్ అండ్ కంట్రోలు సిస్టమ్స్‌లో పిజి కూడా చేశారు. బిజెపితో ఆయన అనుబంధం సేవలకు గుర్తింపుగా మిజోరం గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకూ మిజోరంకు గవర్నర్‌గా ఉన్న పిఎస్ శ్రీధరన్ పిళ్లై గోవా గవర్నర్ అయ్యారు. ఆయన స్థానంలో కంభంపాటి మిజోరం బాధ్యతలు స్వీకరించారు. గువహతి హైకోర్టు న్యాయమూర్తి మైఖెల్ జోతాన్‌కుమా ఆయనతో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి జోరాంతంగా, కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు విచ్చేశారు.

Kambhampati Hari Babu sworn as Mizoram Governor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News