- Advertisement -
న్యూఢిల్లీ: రైతుల భారత్ బంద్పై బాలీవుడ్ నటి కంగనారనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యల్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రైతుల ఆందోళనపై ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ వీడియోను తన వ్యాఖ్యలకు జత చేశారు. ‘రండి భారత్ను బంద్ చేద్దాం. ఈ పడవకు తుపాన్ల కొరత లేదు. అయినా మీరు గొడ్డలితో రంధ్రాలు చేయండి’ రైతుల బంద్ను ఉద్దేశిస్తూ కంగన ఈ వ్యాఖ్యల్ని పోస్ట్ చేసింది. కేంద్రంలోని బిజెపికి అనుకూలంగా మాట్లాడే కంగన కొన్ని రోజుల క్రితం రైతుల ఆందోళనను హేళన చేస్తూ ఓ ట్విట్ చేసి విమర్శలపాలయ్యారు. ఆందోళనలో పాల్గొన్న ఓ వృద్ధురాలి గురించి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసి, విమర్శలు రావడంతో తొలగించారు.
- Advertisement -