Saturday, April 20, 2024

డ్రగ్స్ రాకెట్ కేసులో కన్నడ నటి రాగిణికి బెయిల్ మంజూరు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: డ్రగ్స్ రాకెట్ కేసులో కన్నడ సినీ నటి రాగిని ద్వివేదికి సుప్రీంకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టన్సెస్(ఎన్‌డిపిఎస్) చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం నమోదు చేసిన ఈ కేసులో రాగిణితోపాటు మరి కొందరికి బెయిల్ నిరాకరిస్తూ గత ఏడాది నవంబర్ 3న కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. రాగిణి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వాదనలు వినిపిస్తూ ఈ కేసులో అరెస్టు అయిన మరో ముగ్గురు నిందితులు బెయిల్‌పై విడుదల కాగా రాగిణి మాత్రం జైలులోనే మగ్గుతున్నారని చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ 2న ఆమెను పోలీసులు అరెస్టు చేశారని, ఆ సమయంలో ఆమె వద్ద నుంచి ఎటువంటి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోలేదని ఆయన వాదించారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌కు ఆమె ఫైనాన్స్ చేస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారని, అయితే అందుకు తగ్గ ఆధారాలు ఏవీ వారు సమర్పించలేదని ఆయన తెలిపారు.

Kannada actress Ragini granted bail in drug case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News