సుమంత్ కథానాయకుడిగా నందిత శ్వేత కథానాయికగా నటించిన చిత్రం ‘కపటధారి’. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో క్రియేటివ్ ఎంటర్టైన్మెంట్స్, బొఫ్తా మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కింగ్ నాగార్జున మాట్లాడుతూ “కన్నడలో ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమా చాలా బాగా వచ్చిందని సుమంత్ నమ్మకంగా ఉన్నాడు. సినిమా ట్రైలర్ చూశాను. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.
హీరో సుమంత్ మాట్లాడుతూ.. “నేడు డిఫరెంట్ పాత్రలు చేయడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. అందుకు ఇన్స్పిరేషన్ మా చిన్న మావయ్యే. అలాగే ‘కపటధారి’ అనే డిఫరెంట్ జోనర్ మూవీ చేశాను. ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిత్రం”అని పేర్కొన్నారు. దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి మాట్లాడుతూ “కన్నడ మూవీ ‘కావలుధారి’ సినిమాకు ఇది రీమేక్. తెలుగు, తమిళంలో కూడా నేనే డైరెక్ట్ చేశాను” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ధనుంజయ్, హీరోయిన్ నందితా శ్వేత, అడివిశేష్, ఇంద్రగంటి మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Kapatadhaari movie pre release function