మన తెలంగాణ / కొత్తకోట : ఈనెల 27న రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో కొందుర్గులో నిర్వహించిన 36వ రాష్ట్రస్థాయి ఓపెన్ రాష్ట్రస్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో కొత్తకోట లోని గాడ్స్ ఆన్ వారియర్స్ షోటోఖాన్ కరాటే అకాడమీకి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించినట్లు క్లబ్ ఫౌండర్ అబ్దుల్ నబీ తెలిపారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
అండర్ 19 స్పైరింగ్ విభాగంలో ఇంతియాజ్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించాడు. సీనియర్ బ్లాక్ బెల్ట్ స్పైరింగ్ విభాగంలో హరీష్ యాదవ్ బంగారు పతకం తో పాటు గ్రాండ్ ఛాంపియన్ షిప్ 2021 కైవసం చేసుకున్నాడు. ఈ పథకాలు సాధించిన విద్యార్థులను ప్రముఖ సినీ నటుడు అలీ , సురేష్ లు పతకాలు , సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం వారిని అభినందించారు.ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించిన హరీష్ యాదవ్, ఇంతియాజ్ లను సీనియర్ కరాటే మాస్టర్లు ఎండి సాధిక్, ఇస్తేఖర్ , చందు, మంజునాథ్, శివరాజ్ లు అభినందించారు.