Tuesday, April 16, 2024

మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన పంతులు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని దాచారం గ్రామానికి చెందిన అరిగె రవి కన్నుమూశారు. ఈ నేపథ్యంలో రవి కుటుంబాన్ని సోమవారం ఆ గ్రామానికి చెందిన కర్నె జ్యోతి వీరేశం పరామర్శించి రూ.5వేల ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మంగపండ్ల ధనమ్మ మల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ కప్పల లింగయ్య, నాయకులు, గ్రామస్థులు మర్రి చంద్రయ్య, ఇట్టబోయిన యాదగిరి, సాదుల పెద్ద సత్తయ్య, మాది రెడ్డి బాల్‌రెడ్డి, అండెం దయాకర్‌రెడ్డి, ఇట్లబోయిన మల్లయ్య, ఇట్లబోయిన రాములు తదితరులు పాల్గొన్నారు. కర్నె వీరేశం గుండాల ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ తన సొంతూరులో ప్రజల కోసం సేవలు చేయడానికి ముందుకు వస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News