Wednesday, April 24, 2024

బాబు పాలన దోచుకో, దాచుకో లాగా ఉండేది: కారుమూరి

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్‌ఆర్ కలలుగన్న పోలవరం ప్రాజెక్ట్‌ను సిఎం జగన్ మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు ప్రశంసించారు. మంగళవారం కారుమూరి మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనంతా దోచుకో, దాచుకో అనే రీతిలో సాగిందని మండిపడ్డారు. పోలవరాన్ని చంద్రబాబు ఎటిఎంలా వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోడే చెప్పారని గుర్తు చేశారు.

Also Read: మరింత పదునైన రాజద్రోహ చట్టం?

నాడు పోలవరం కోసం ముందస్తుగానే వైఎస్‌ఆర్ కాలువలు తవ్వించారని కొనియాడారు. బాబు హయాంలో ప్రచార ఆర్భాటాలకే పోలవరాన్ని వాడుకున్నారని కారుమూరి దుయ్యబట్టారు. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యామ్ కోతకు గురవడానికి కారణం చంద్రబాబే అని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాక స్పిల్ వే… ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేశామని ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేది సిఎం జగన్ అని మెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News