Wednesday, April 17, 2024

అన్ని వర్గాల సంక్షేమం కోసం కెసిఆర్ కృషి: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

KCR effort on all communities with welfare

 

హైదరాబాద్: ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ విద్యనందించేందుకు తెలంగాణలో 900కు పైగా గురుకుల పాఠశాలలను సిఎం కెసిఆర్ ఏర్పాటు చేశారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని పొగిడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని, సిఎం కెసిఆర్ వ్యవసాయాన్ని పండగలా మార్చారని ప్రశంసించారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని జగదీష్ రెడ్డి కొనియాడారు. నియంత్రిత సాగుతో రైతులకు మేలు జరుగుతుందని, కాళేశ్వరం నీటితో సూర్యాపేట జిల్లా వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News