Wednesday, April 17, 2024

జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం: కవిత

- Advertisement -
- Advertisement -

KCR Family visit jogulamba temple

జోగులాంబ గద్వాల: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి వసంత పంచమి శుభాకాంక్షలు అని ఎంఎల్‌సి కవిత తెలిపారు. బాలబ్రహ్మేశ్వర స్వామిని ఎంఎల్‌సి కవిత, సిఎం కెసిఆర్ సతీమణి శోభ, మంత్రి కెటిఆర్ సతీమణి శైలిమ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పారు. అలంపూర్‌లో ఎంతో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందని, అలంపూర క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ పూజలో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంఎల్‌ఎలు కృష్ణ మోహన్ రెడ్డి, అబ్రహ్మాం, వెంకటేశ్వర రెడ్డి, ఎంపి రాములు, జడ్‌పి చైర్ పర్సన్ సరిత, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News