Wednesday, April 24, 2024

కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి

- Advertisement -
- Advertisement -

KCR should enter the country's politics: TRS NRI

ఏ ఎన్నారైను అడిగినా ముక్తకంఠంతో ఇదే నినాదం
52వ ఎన్నారై టిఆర్‌ఎస్ చెక్ రిపబ్లిక్ శాఖను ప్రారంభోత్సవంలో
టిఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల

హైదరాబాద్: సిఎం కెసిఆర్ తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కోసం యూరప్ పర్యటనలో ఉన్న టిఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల బుధవారం చెక్ రిపబ్లిక్‌లో ఎన్నారైలతో సమావేశం కావడంతో పాటు 52వ ఎన్నారై టిఆర్‌ఎస్ చెక్ రిపబ్లిక్ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ ఇది టిఆర్‌ఎస్ పార్టీకి 52 వ ఎన్నారై శాఖ అని ఆయన పేర్కొన్నారు. మిగతా యూరప్ దేశాల మాదిరిగానే ఇక్కడ కూడా విశేష స్పందన లభించిందన్నారు. ఏ ఎన్నారైని అడిగినా కెసిఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ముక్త కంఠంతో నినదిస్తున్నారని ఆయన తెలిపారు మోడీ పాలనలో దేశం భ్రష్టు పట్టిందన్నారు. కేంద్రం తెలంగాణకు ఆర్థిక సాయం చేయక పోగా చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే చెక్ రిపబ్లిక్ కమిటీని ప్రకటిస్తామని మహేశ్ బిగాల తెలిపారు. ఎన్నారైలు రాఘవ రెడ్డి లోకసాని, పావని, ప్రేమ్, శిరీష, జై ప్రకాష్, ఆదిత్య, రవీంద్ర బాబు అరుణ్, శ్రీనాథ్, ప్రశాంత్, అభినవ్, బీరేన్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News