Thursday, April 25, 2024

కుల వృత్తులకు పెద్దపీట: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

KCR welfare schemes help to BC Caste

 

మహబూబాబాద్: తెలంగాణలో కుల వృత్తులకు పెద్దపీట వేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో జ్యోతిరావు పూలే జయంతి వేడకులు ఘనంగా జరిగాయి. పూలే విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కెసిఆర్ ప్రభుత్వంలో తెలంగాణలో అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని ప్రశంసించారు. జ్యోతి రావు పూలే, అంబేద్కర్ ఆశయాలను కెసిఆర్ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. యాదవులకు గొర్రెలు, మత్సకారులకు చేప పిల్లలు, రజకులు, నాయి బహ్మణులకు కరెంట్ ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. మహిళల చదువు కోవాలని పూలే పోరాటాలు చేశారని, ఇప్పడు కెసిఆర్ బాలికల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News