- Advertisement -
హైదరాబాద్: కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు చంచల్ గూడ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.కోటీ 10లక్షల లంచం కేసులో నాగరాజుపై ఎసిబి రెండు కేసులను నమోదు చేసింది. 34, 100ఎకరాల భూమిని ల్యాండ్ మాఫియాకు నాగరాజు అప్పజెప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి. నిన్ననే రెండు కేసుల్లో అయనను అరెస్టు చేసిన అధికారులు జైలుకు తరలించారు. రిమాండ్ లో ఉన్న నాగరాజు జైల్లోనే సూసైడ్ చేసుకున్నాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నాగరాజు ఆత్మహత్యకు సంబంధించిన మరిన్ని వవరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
- Advertisement -