Thursday, April 25, 2024

ఇంటర్ ఫలితాలలో మెరిసిన కెజిబివి విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

KGBV student is best talent in inter results

 

ఎంపిహెచ్‌డబ్ల్యు గ్రూప్‌లో 98 శాతం మార్కులతో
మొదటి స్థానంలో నిలిచిన పి.వైష్ణవి

మనతెలంగాణ/హైదరాబాద్ : కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం (కెజిబివి)కి చెందిన విద్యార్థిని పి.వైష్ణవి ఇంటర్ ఎంపిహెచ్‌డబ్ల్యూ గ్రూప్‌లో 98 శాతం మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన పి. వైష్ణవి పదవ తరగతిలో మంచి మార్కులతో ఉతీర్ణత సాధించారు. ఉన్నత చదువు కోసం ప్రైవేట్ విద్య వైపు ఆలోచించకుండా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్న గురుకులాలు, కెజిబివిలను చూసి పెద్దపల్లి జిల్లా ముత్తారం గ్రామ కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో చేరారు. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో రాష్ట స్థాయిలో ఎంపిహెచ్‌డబ్ల్యు గ్రూప్‌లో 98 శాతం మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. అన్ని వసతులు కల్పించి తన లాంటి వాళ్ళ భవిష్యత్‌ను తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వానికి పి.వైష్ణవి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారంతో తాను మొదటి స్థానంలో నిలిచానని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News