- Advertisement -
చెన్నై: కోలీవుడ్ ప్రముఖ నటి ఖుష్బూ సమీప బంధువుకు కరోనా వైరస్ సోకి చనిపోవడంతో ఆమె విషాదంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్లో వెల్లడించారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు, బంధువుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఓదార్చుతున్నారు. బంధువు ఎవరనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తమిళనాడులో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. తమిళనాడులో కరోనా వైరస్ 22 వేల మందికి వ్యాపించగా 176 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల విషయంలో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. భారత్లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 1.91 లక్షలకు చేరుకోగా 5413 మంది మృతి చెందారు.
- Advertisement -