- Advertisement -
హనోయి: తుపాన్ మొలవే కారణంగా సెంట్రల్ వియత్నాంలో కొండచరియలు విరిగి ఇళ్లపై పడడంతో ఎనిమిది మంది మృతి చెందగా, 42మంది గల్లంతు అయ్యారు. క్వాంగ్నామ్ ప్రావిన్స్ లోని ట్రా వాన్ గ్రామంలో కొండపక్కనున్న ఇళ్లపై కొండచరియలు విరిగి పడి ఎనిమిది మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ గ్రామానికి దూరంగా ట్రాలెంగ్ గ్రామంలో మరో కొండచరియ విరిగి పడి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఇళ్లకు చెందిన 45 మందిలో నలుగురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మూడు మృతదేహాలను శిధిలాల నుంచి వెలికి తీయగలిగారు.
Killed 8 people After landslides leave in Vietnam
- Advertisement -