- Advertisement -
హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చిన వారిని, వారితో కలిసిన వారిని పూర్తి స్థాయిలో పరిశీలనలో ఉంచాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో సెలవులు ఇవ్వొద్దన్నారు. కింగ్ కోఠి ఆస్పత్రిని కూడా సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఈటెల సూచించారు. ఆస్పతుల్లో కావాల్సిన పరికరాలన్నీ సమీకరించుకోవాలన్నారు. గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయి కరోనా ఆస్పత్రిగా మార్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజలు లాక్డౌన్ను పాటించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి మూడో దశకి చేరుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి ఈటెల సమీక్షలు జరిపారు.
King koti hospital ready for Corona patients
- Advertisement -