- Advertisement -
దుబాయి: ఐపిఎల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ స్పష్టం చేశాడు. ఈసారి ఐపిఎల్లో పంజాబ్ను విజేతగా నిలుపడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమన్నాడు. ఇక కెప్టెన్సీ బాధ్యతల ప్రభావం తన బ్యాటింగ్పై ఉండదన్నాడు. జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు. జట్టులో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదన్నాడు. సమన్వయంతో ఆడితే విజయాలు సాధించడం కష్టమేమీ కాదన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పంజాబ్ చాలా సమతూకంగా కనిపిస్తోందన్నాడు. ఈసారి ఐపిఎల్ చాలా ఆసక్తికరంగా సాగడం ఖాయమన్నాడు. అన్నిజట్లుకూడా గెలుపే లక్షంగా పెట్టుకున్నాయన్నాడు. దీంతో హోరాహోరీ సమరం తప్పదన్నాడు.
Kings XI Punjab will win IPL 2020: K L Rahul
- Advertisement -