Saturday, April 20, 2024

ఆ ఘనత సాధించిన మూడో జట్టుగా కోల్‌కతా

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్ 2021లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగన మ్యాచ్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ అరుదైన ఘనత సాధించింది. ఈ సీజన్ తొలి పోరులో సన్‌రైజర్స్ పై 10 పరుగుల తేడాతో విజయం సాధించిన కోల్ కతా జట్టు.. ఐపిఎల్ లో 100వ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా కోల్‌కతా నిలిచింది. ఐపిఎల్ లో కోల్‌కతా జట్టుకంటే ముందు ముంబయి ఇండియన్స్(120), చెన్నై సూపర్ కింగ్స్(106)లు ఈ ఘనత సాధించాయి. కాగా, సన్‌రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా రైడర్స్ నైట్ బ్యాట్స్ మెన్లు నితీశ్ రాణా(80), రాహుల్ త్రిపాఠీ(53)లు అర్ధ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు భారీ స్కోరు చేసింది. ఆ తరాత 188 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ ఐదు వికెట్లకు 177 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.

KKR become 3rd team to win 100 matches

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News